శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భావం
ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భావం :-
హిందూ పురాణాల (ముఖ్యంగా శివ పురాణం) ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువు తమ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంపై వాగ్వివాదానికి దిగారు. అప్పుడు పరమేశ్వరుడు కలహాన్ని ఆపడానికి వారివురు మధ్య ఒక ప్రకాశవంతమైన జ్యోతి స్థంభం వలే వెలిశాడు. అప్పుడు శివుడు, బ్రహ్మ విష్ణువులతో అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెట్టమని, ఎవరు ముందుగా కనిపెడితే వారే గొప్ప అని చెప్పాడు.
అప్పుడు బ్రహ్మ ఊర్ధ్వ లోకానికి వెళ్లగా, విష్ణువు పాతాళ లోకానికి వెళ్ళాడు. విష్ణువు నిజాయతీగా తాను అగ్నిస్తంభం మొదలు కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటే, బ్రహ్మ మాత్రం తాను కనిపెట్టానని అందుకు సాక్షిగా కేతకి పుష్పాన్ని, గోవును చూపించాడు. కానీ బ్రహ్మ అబద్దమాడాడని గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని, కేతకి పుష్పం పూజకు పనికిరాదని శపించెను. గోవు తలతో అవునని చెప్పి, తోకతో కాదని చెప్పింది కాబట్టి గోవు తోకకు మాత్రమే పూజార్హత ఉంటుందని శపించాడు. పరమ శివుడు వెలసిన ఈ జ్యోతి స్తంభం నుంచి ఏర్పడినవే పన్నెండు జ్యోతిర్లింగాలు.
ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకం :-
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్ | ఉజ్జయిన్యాం మహాకాలమ్ ఓంకారేత్వమామలేశ్వరమ్ ||
ప్రజ్వల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ | సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||